మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ

  • మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన ఈసీ
  • ప్రతి నియోజకవర్గంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
  • పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేసిన ఈసీ
మహిళల ఓటింగ్ శాతం పెంచేందుకు పలుచోట్ల వారి కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలోను ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో మహిళలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా మోడల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.

Telangana Assembly Election
women
Congress
BJP
BRS

More Telugu News